తెలంగాణలో ఇవాళ జేపీ నడ్డా ప్రచారం

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు ప్రచారం వేగవంతం చేశాయి. ఇక ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సకల జనుల విజయ సంకల్ప సభ పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభలో రోడ్డు షోలలో ఆయన పాల్గొంటారు.

JP Nadda's campaign in Telangana today
JP Nadda’s campaign in Telangana today

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో నేరుగా నారాయణపేటకు చేరుకొని ఒంటిగంట నుంచి రెండు గంటల దాకా అక్కడి సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల దాకా చేవెళ్ల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6:30 నుంచి మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్ షోలలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు బేగంపేటకు చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news