జూపల్లి కృష్ణారావును వదిలిపెట్టొద్దు..ఓడిస్తా – నాగం

-

జూపల్లి కృష్ణారావును వదిలిపెట్టొద్దు..ఓడిస్తానని సవాల్ చేశారు నాగం జనార్దన్ రెడ్డి.పార్టీ కోసం కష్టపడిన జగదీశ్వర్ రావుకి కాకుండా పారాచూట్ నాయకుడు జూపల్లికి టికెట్ ఇచ్చారని ఫైర్‌ అయ్యారు. జూపల్లిని వదిలిపెట్టేది లేదు, దానికోసం నా సాయం మీకు ఉంటదన్నారు నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల అయిన తర్వాత.. ఆ పార్టీ అసంతృప్త నేతలు బయటకు వస్తున్నారు. ఈ తరుణంలోనే..నాగం జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్ కర్నూల్‌ లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తానంటూ సవాల్‌ విసిరారు నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తున్నాడని నిప్పులు చెరిగారు.ఎలా తెలంగాణ రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా ఎన్నికల కోసం పారాషూట్ లో వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తున్నాడని.. రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు నాగం జనార్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news