నేడు కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం

-

నేడు కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేయనున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇవాళ కామారెడ్డికి రానున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ఆయన బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు. కర్ణాటకలో కరెంట్ కోతలపై బిఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడనున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

siddaramaiah

ఇది ఇలా ఉండగా… తెలంగాణలో డీకే శివకుమార్‌ను ప్రచారానికి తీసుకు రావద్దు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.తెలంగాణలో ఆ మధ్య ప్రచారానికి వచ్చి కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అని నోరు జారిన డీకే శివ కుమార్ వ్యాఖ్యలు డ్యామేజ్ చేయడంతో మళ్లీ ప్రచారానికి రావద్దని వేడుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు. మరోవైపు తెలంగాణలో ప్రచారానికి వచ్చినపుడు కర్ణాటకలో ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టి తన సీటుకు ఎసరు పెట్టడంతో ఆలోచనలో పడ్డారు డీకే శివ కుమార్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news