ఖానాపూర్ అభ్యర్థి కులం విషయంపై కవిత క్లారిటీ

-

ఖానాపూర్ అభ్యర్థి కులం విషయంపై కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. జాన్సన్ నాయక్ ఎస్టీనే కాదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాన్సన్ నాయక్ ఎస్టీనే కాదు.. వాళ్ల ఫోర్ ఫాదర్స్ క్రిస్టియన్స్ అంటూ రేఖానాయక్ ఆరోపణలు చేశారు. ఫేక్ సర్ఠిఫికెట్ తెచ్చి ఎస్టీ అంటున్నారు..ఆధారాలతో నిరూపిస్తా…నేనే పోటీ ఉంటా..నేనే గెలుస్తా అంటూ రేఖా నాయక్ ప్రకటించారు.

అయితే..రేఖా నాయక్‌ చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఖానాపూర్ అభ్యర్థి కులం విషయంలో ఎటువంటి ఇబ్బందీ లేదని చెప్పారు. అటు మైనంపల్లి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి విషయంలో పార్టీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పార్టీ నిర్ణయం కు నేను అయిన… ఎవరు అయిన కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు కవిత. మళ్లీ అధికారంలోకి వచ్చేది BRS పార్టీనేని చెప్పుకొచ్చారు కవిత. గెలిచే వారికి అవకాశాలు ఇచ్చారు…మిగిలిన వాళ్ళకి పార్టీ ఇతర రూపంలో ఛాన్స్ ఇస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news