కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ చీఫ్ కేసిఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. దీనిపై తాజాగా కవిత స్పందిస్తూ సంచలన కామెంట్లు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు జారీ చేశారని కవిత విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో కవిత మాట్లాడుతూ కేసీఆర్ ఏం తప్పు చేశారు అని ఇలా నోటీసులు జారీ చేశారు.

నిధులు, నీళ్లు ఇవ్వడం ఆయన చేసిన తప్పా? కాళేశ్వరం కమిషన్ అనేది కాంగ్రెస్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 35% భూభాగానికి నీళ్లు చేరుతాయి. రైతులకు నీటి కష్టాలు ఉండద్దని, ఈ ప్రాజెక్టు కట్టారు. రాష్ట్రం సస్య శ్యామలంగా ఉండాలని ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు అంటూ కవిత మాట్లాడారు. ఇందులో కేసీఆర్ తప్పు ఏమీ లేదని ఎమ్మెల్సీ K కవిత అన్నారు.