ఇవాళ చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు..గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం కేసీఆర్?

-

తెలంగాణ రాష్ట్ర సీఎం ఇవాళ అసెంబ్లీ వేదికగా పలు వర్గాల వారికి శుభవార్త చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముయ్యనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్ దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించనున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి తోపాటు ఐఆర్ ను సీఎం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలు అటు వరదలపై కూడా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు రైతుల పంట నష్టం పై ఆర్థిక సహాయం ప్రకటించవచ్చని సమాచారం అందుతోంది. అలాగే రుణమాఫీపై కూడా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version