మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

-

కేంద్ర మాజీ మంత్రి, ఆర్‌జేడీ నేత శ్రీ శరద్ యాదవ్ తాజాగా మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న శరద్ యాదవ్.. నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని శరద్ యాదవ్ కుమార్తె అధికారికంగా ప్రకటించారు.

 

ఇక, కేంద్ర మాజీ మంత్రి, ఆర్‌జేడీ నేత శ్రీ శరద్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శ్రీ శరద్ యాదవ్ అందించిన మద్దతును సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version