నేడు మెదక్‌లో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

-

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకో రెండు నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్లపై విమర్శలే ప్రత్యేక అస్త్రాలుగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పదేళ్ల పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయలేదని ఆరోపిస్తూ.. తెలంగాణలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టాలని కోరుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

kcr

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర నేడు మెదక్‌లో సాగనుంది. ఈరోజు (మే 5వ తేదీ 2024) రాత్రి 7 గంటలకు మెదక్‌లో కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కేసీఆర్ రాక కోసం ఇప్పటికే స్థానిక నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. గులాబీ బాస్ బస్సు యాత్ర కోసం భారీగా జనసమీకరణ కూడా చేసినట్లు స్థానిక నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news