తెలంగాణ ఎర్రవల్లిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో దెయ్యాలు ఉన్నాయని అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలుజారి కింద పడ్డారు. ఈ ప్రమాద ఘటనలో ఆయన కాలు విరిగింది. గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా అదే ఫామ్ హౌస్ లో కాలు జారీ పడడంతో వైద్యులు కాలికి సర్జరీ చేశారు.

ఈ ఇద్దరు నేతలకు కూడా తుంటి ఎముక విరగడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. వీరిద్దరికీ కాలు విరగడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో దయ్యాలు ఉన్నాయని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే నిజానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలుజారి పడింది కేసీఆర్ ఫామ్ హౌస్ లోనా లేకపోతే తన ఫామ్ హౌస్ లోనా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాదులోని సోమాజిగూడ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కెసిఆర్ నిన్న ఆసుపత్రికి వెళ్లి పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.