BREAKING : డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ

-

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే.. డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ..నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ నిలయమైన ప్రగతి భవన్‌ లో కీలక భేటీ జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కాసేపటి క్రితమే.. ప్రారంభమైన ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ నేతలందరూ హాజరయ్యారు.

అయితే.. ఈ నేపథ్యంలోనే.. డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ..నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు.. తెలంగాణ భవన్ లో దసరా రోజున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ లు,జిల్లా అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్ లతో సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఈ సమావేశం ప్రగతి భవన్‌ లో జరుగుతూనే ఉంది. మరి కాసేట్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version