కాళేశ్వరం విచారణ… కేసీఆర్ వెంట వస్తున్న కవిత

-

మరికాసేపట్లోనే కాలేశ్వరం విచారణకు బి ఆర్ కే భవన్ కు కేసిఆర్ రాబోతున్నారు. ఈ తరుణంలోనే కెసిఆర్ వెంట కల్వకుంట్ల కవిత కూడా వస్తున్నారని తెలుస్తోంది.  కేసీఆర్ వెంట కవిత, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి బయలుదేరారు.

KCR
KCR is going to come to BRK Bhavan for Kaleshwaram inquiry soon

ఇప్పటికే ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్ ఉ.11.30 గంటలకు BRK భవన్‌కు చేరుకోనున్నారు. ఆయన వెంట 9 మందికి అధికారులు అనుమతి కల్పించారు.  ఇది ఇలా ఉండగా… తెలంగాణ బి ఆర్ కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ కేసీఆర్ విచారణకు రానున్న నేపథ్యంలో… గులాబీ పార్టీ నేతలు… భారీ సంఖ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. మొన్న హరీష్ రావు వచ్చిన సమయంలోనే వేలాది సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఇవాళ కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో… వేలాది సంఖ్యలో మళ్లీ గులాబీ నేతలు తరలివచ్చే ఛాన్స్.. ఉంది. ఈ నేపథ్యంలోనే బి ఆర్ కే భవన్ దగ్గర భారీగా పోలీసులు మొహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news