కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించినప్పటి నుంచి ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రతిసారి అవమానిస్తున్నారని ప్రజాతీర్పును పదేపదే అగౌరవ పరుస్తున్నారంటూ దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపణలు చేశారు. ఈ పద్ధతి కాంగ్రెస్ ను మరింత క్షీణింప చేస్తుందని వెల్లడించారు. రాహుల్ గాంధీ వాస్తవాలను వక్రీకరించారంటూ ప్రజల తీర్పును అవమానించారంటూ దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపణలు చేశారు.

ప్రజలు ఎప్పుడు రాహుల్ గాంధీని తిరస్కరించారని ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారంటూ మాట్లాడారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు మహారాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని దానిని ప్రజలు ఎప్పటికీ క్షమించరంటూ చెప్పారు. ఏక్ నాథ్ షిండే, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కూడా రాహుల్ గాంధీ వాధనలను త్రోసిపుచ్చారు. ఈ వార్తపై ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఫడ్నవిస్ ఆర్టికల్ కూడా ఆయన స్వయంగా రాశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలలో ఎలాంటి స్పష్టత లేదని దేశ ప్రజలను తీవ్ర గందరగోళానికి రాహుల్ గాంధీ గురి చేస్తున్నారని అన్నారు.
ఆయన విభజన వాదాన్ని ప్రచారం చేస్తున్నారని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నియామకాలను తప్పుపట్టినందుకు కాంగ్రెస్ పైన నిప్పులు జరిగారు. ఫేక్ ఓటర్స్ అనే రాహుల్ గాంధీ వాదనలను ఫడ్నవీస్ తిప్పి కొట్టారు. యువ ఓటర్ల పెరుగుదల గణనీయంగా నమోదయిందని వెల్లడించారు. 26 లక్షల పైగా యువతి యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని దీనికి అనుగుణమైన డేటా ఉందని ఫడ్నవిస్ వివరించారు. కాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యాలను ఈసీ సైతం ఖండించింది.