చీకటి రోజు అని కేసీఆర్ అనడం గురవింద గింజలా ఉంది : కిషన్ రెడ్డి

-

చీకటి రోజు అని కేసీఆర్ అనడం గురవింద గింజలా ఉందని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని కేసీఆర్ డైలాగ్ చెప్పారు. కూతురుని అరెస్ట్ చేస్తే.. స్పందించని కేసీఆర్.. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తే ఎందుకు స్పందించారు అని ప్రశ్నించారు.  ఢిల్లీలో తీగ లాగితే హైదరాబాద్ లో డొంక కదిలింది అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ ని అందరూ సమర్థిస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలోనే కవితను అరెస్ట్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి దమ్ముందా..? కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆధారాలున్నాయి.. అవినీతిని నిరూపిస్తానని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి కుంభకోణాల పార్టీ అన్నారు.  ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద మాటలతోనే పూట గడుపుతుంది. గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. సీబీఐతో దర్యాప్తు చేయడానికి సీఎంకు ఉన్న అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version