BREAKING : పోడు భూములపై సమస్యపై కేసీఆర్ సంచలన ప్రకటన

-

BREAKING : పోడు భూములపై సమస్యపై కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూములపై సమస్యను తీర్చుతామని వెల్లడించారు సీఎం కేసీఆర్‌. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని గిరిజన, ఆదివాసీ భవన్ లను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బంజారాహిల్స్ లో ఇప్పుడు బంజారా భవన్ ఉందని తెలిపారు.

ఎన్నో సమస్యలకు పరిష్కారం కావాలని.. గిరిజనుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రకటించారు. ఇది భారతదేశ గిరిజనులకు అంతా స్ఫూర్తి అని వివరించారు. 24 కోట్లతో ఆదివాసి భవనం నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. గిరిజనులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని.. అందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు సీఎం కేసీఆర్‌. కొంత మంది నాయకులు చిచ్చు పెట్టాలని చూస్తారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version