త్వరలో కాంగ్రెస్‌లోకి కీలక నేతలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

వచ్చే తెలంగాణ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని జోస్యం చెప్పారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు  ఉంటాయని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలకు చెందిన కొందరు కీలక నేతలు త్వరలోనే పార్టీలో చేరుతారని తెలిపారు.

సోనియా గాంధీ సభకు గ్రౌండ్ ఇవ్వకపోయినా విజయభేరి సభ విజయవంతమైందన్నారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధుల్లో 86 మంది పక్క పార్టీల నుంచి వచ్చిన వారేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సామాజిక న్యాయం, స్వేచ్ఛ కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ గెలుపు ప్రజలకు తక్షణ అవసరమని రేవంత్ వ్యాఖ్యానించారు.  

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వరుసపెట్టి భేటీ అవుతోంది. అభ్యర్ధుల ఎంపికపై నిన్న , ఇవాళ సుదీర్ఘంగా చర్చించింది స్క్రీనింగ్ కమిటీ. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తయినట్టు సమాచారం. 60 శాతానికిపైగా ఏకాభిప్రాయంతో అభ్యర్ధులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 29న మరోసారి భేటీ కానుంది స్క్రీనింగ్ కమిటీ. 

Read more RELATED
Recommended to you

Exit mobile version