తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి !

-

తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల విషయంలో ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ విషయాన్ని జేపీ నడ్డా స్వయంగా సోము వీర్రాజుకి ఫోన్ చేసి తెలిపారు. ఆయన స్థానంలో సత్య కుమార్ ని నియమించారు. మరోవైపు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఢిల్లీలో సమావేశమయ్యారు జేపీ నడ్డా.

ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్లు బండి సంజయ్ కి తెలిపారు. తనకి కొన్ని కొత్త బాధ్యతలు అప్పగిస్తామని బండి సంజయ్ కి నడ్డా హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ మేరకు మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. కిషన్ రెడ్డికి గతంలో తెలంగాణ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉండడం కలిసొచ్చే అంశం అని బిజెపి భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version