BREAKING : కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా ?

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్‌రెడ్డి దూరం అయ్యారు. ఢిల్లీలోనే ఉన్నా సమావేశానికి హాజరు కాలేదు కిషన్‌రెడ్డి.

అటు మంత్రిత్వ శాఖ అధికారులు..కూడా కిషన్‌రెడ్డి ఇంటికి రాలేదు. ఇలాంటి తరుణంలో మీడియాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నాడు కిషన్‌రెడ్డి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించాక ఇప్పటివరకు స్పందించని కిషన్ రెడ్డి.. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

ఇక అటు కేంద్ర ప్రభుత్వంపై బండి సంజయ్ అలిగినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తగా ఉంటానని బండి సంజయ్‌ ప్రకటించినట్లు సమాచారం అందుతోంది. కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు బండి సంజయ్ విముఖత చూపిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version