జగన్ నన్ను కొట్టినా పర్వాలేదు.. ఇది ఆయన పెట్టిన భిక్ష : ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

-

నెల్లూరు లో నారా లోకేష్ యువగలం పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో మీటింగ్ లలో వైసిపి పైన మరియు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పైన లోకేష్ మరియు నారాయణ చేస్తున్న విమర్శలపై అనిల్ కుమార్ యాదవ్ తనదైన రీతిలో రిప్లై ఇస్తున్నాడు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ మీడియా తో మాట్లాడుతూ లోకేష్ ని ఉద్దేశించి నీ అరుపులకు మాటలకు భయపడే అంత పిరికి వాడిని నేను కాదు అంటూ ఘాటుగా బదులిచ్చాడు. ఈ రోజు నేను ఒక ఎమ్మెల్యే గా ప్రజల్లో ఇంతటి గౌరవం మరియు అభిమానాన్ని సంపాదించుకున్నాను అంటే దానికి కారణం జగనన్న పెట్టిన భిక్ష అన్నాడు. ఆయన నన్ను తిట్టినా లేదా కొట్టినా నేను భరిస్తానన్నాడు, ఎందుకంటే ఆ చనువు మరియు హక్కు జగన్ మోహన్ రెడ్డి కి ఉందని సంతోషంగా చెప్పాడు అనిల్ కుమార్ యాదవ్.

లోకేష్ రాసుకో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే… నెల్లూరు లో గెలిచేది నేనే అంటూ ధీమాను వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version