Mlc బస్వరాజు సారయ్యకి కొండా మురళీ హెచ్చరిక..!

-

MLC బస్వరాజు సారయ్యకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు మాజీ MLC కొండా మురళీ. పోచమ్ మైదాన్ లో ఇటీవల తొలగించిన డబ్బాల బాధితులను పరామర్శించిన కొండా మురళి.. నిజాయితీ తో కూడిన రాజకీయాలు చేయాలంటూ బస్వరాజు సారయ్య పై పరోక్షంగా కామెంట్స్ చేసారు. నువ్వు నిజంగా బీసీ నాయకుడివి అయితే పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తావా అని ప్రశ్నించారు.

నేను యునానిమస్ గా గెలిచి, పార్టీ మారడంతో రాజీనామా చేసినా. నువ్వు పార్టీ పరంగా గెలిచి పార్టీ మారావు.. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి రాజకీయం చెయ్యి. అంతేకాని ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఇక్కడ కొండ మురళి హవ నడుస్తుంది. పేదలకు ఇళ్ల ఇస్తున్నాం. మీరు ఇక్కడే ఉండండి.. ఎవరు అడ్డు వచ్చినా చూసుకుంటానని హామీ ఇచ్చారు. డబ్బాలు తొలగించింది మా ప్రభుత్వం అయినా.. తమకు ప్రజలే ముఖ్యమనీ అన్న కొండ మురళి.. కొండా దంపతులు ఉన్నంతవరకు ఎవరికి అన్యాయం జరగనివ్వం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version