కొండా సురేఖ వ్యాఖ్యలు అవాస్తవం.. కేటీఆర్ వాంగ్మూలం

-

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన పై సంచలన వ్యాఖ్యలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందే విచారించింది కోర్టు. ఇవాళ కేటీఆర్ తన వాంగ్మూలం ఇచ్చారు. బాధ్యత గల పదవీ లో ఉన్న నా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు.

“డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తాననీ కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. సాక్షులు నాకు 18
ఏళ్లుగా తెలుసు. కొండా సురేఖ వ్యాఖ్యలను టీవీలో చూశాను. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె
నా పై మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నేను ఫోన్ ట్యాపింగ్
చేశాననీ మాట్లాడారు. నాకు, బీఆర్ఎస్ కి నష్టం చేయాలనేదే ఆమె ఉద్దేశం.  మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవం” అని మొత్తం 30 నిమిషాల పాటు కేటీఆర్ వాంగూలం ఇచ్చారు. కొండా సురేఖ మీడియాతో మాట్లాడిన వీడియో రికార్డింగ్స్ కూడా కోర్టుకు అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version