రిజర్వేషన్లపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

-

బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ వివాదంలో చిక్కుకున్నారు. రిజర్వేషన్ల మీద కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కులం, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దు అంటూ సంచలన ట్వీట్ చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

ఆ ట్వీట్‌ కాస్త వైరల్‌ కావడంతో.. విమర్శల పాలయ్యారు. దీంతో ఆ ట్వీట్‌ ను డిలీట్‌ చేశారు. కానీ ఆ ట్వీట్‌ అప్పటికే వైరల్‌ కావడంతో… దళిత, బహుజన, మైనారిటీ వర్గాలు…కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై మండిపడుతున్నాయి. అటు అనవసర వివాదంపై తలపట్టుకున్నారు బీజేపీ పెద్దలు. కాగా, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవలే, హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version