మైనంపల్లి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : కౌశిక్ రెడ్డి

-

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పాడి కౌశిక్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావు పై చేసిన వాక్యాలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూకబ్జాలకు పాల్పడి రౌడీ షీటర్ గా ఉండి నగర బహిష్కరణకు గురైన మైనంపల్లికి మంత్రిని విమర్శించే స్థాయి లేదన్నారు. మైనంపల్లి సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ ను ఓడిస్తే, తాను ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు.

కాగా, ఇటీవలే తన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు అందులో స్వల్ప మార్పులు చేసే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్థానానికి ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని బీాఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news