కేబినెట్‌లోకి పట్నం మహేందర్‌రెడ్డి.. ఆరోగ్య శాఖ బాధ్యతలు !

-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన సీఎం కేసీఆర్ అనూహ్యంగా కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈటల బర్తరఫ్ తో ఖాళీ అయిన స్థానాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో భర్తీ చేయనున్నట్లు సమాచారం.

గవర్నర్ ఆమోదిస్తే రేపు ఉదయం 11:30 గంటలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కాగా, తాండూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ప్రకటించినందున గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మహేందర్ రెడ్డికి.. మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news