జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు – KTR

-

జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి KTR. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అని చురకలు అంటించారు.

ktr comments on power bills

అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మందిని బీఆర్ఎస్ పార్టీ చూసిందని.. అయినా రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, నీలాంటి వాళ్ళను మట్టికరిపించిందని గుర్తించారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్ … తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా… మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా అంటూ ఆగ్రహించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news