“కేసిఆర్ గారి ఫ్లెక్సీకి రాఖీ” కట్టే కార్యక్రమం చేపట్టాలి – కేటీఆర్ ఆదేశాలు

-

రేపు రాఖీ పండగ సందర్భంగా నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న మహిళా గురుకుల కాలేజీలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లను సందర్శించి రాఖి పండగను అక్కడి విద్యార్థినులతో జరుపుకోవాలి. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.

పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో “కేసిఆర్ గారి ఫ్లెక్సీకి రాఖీ” కట్టే కార్యక్రమం చేపట్టాలని.. రేపు (తేదీన) ప్రతి గ్రామం మరియు బస్తీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి, పార్టీ మహిళా విభాగంతో పాటు పార్టీ ఇతర విభాగాలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మహిళ ప్రజా ప్రతినిధులు, మహిళ వార్డు సభ్యులు, సర్పంచ్ లు, మునిసిపల్ కౌన్సిలర్స్, జెడ్పీ చైర్మన్, మేయర్స్, కార్పోరేటర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ చైర్ పర్సన్లు అందరూ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు కేటీఆర్‌. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహిళ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించి, స్థానిక దినపత్రికలు మరియు లోకల్ టీవీ ఛానళ్ళల్లో ప్రముఖంగా కవరేజ్ వచ్చేలా సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version