KTR: రేవంత్‌ పాలనలో 50కి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో మృతి !

-

రేవంత్‌ రెడ్డి పాలనపై కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు అని… ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయని ఫైర్ అయ్యారు. నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు అని… నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు… నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారని సెటైర్లు పేల్చారు.


నాడు కడుపునిండా అన్నం తిని-అనుకున్న లక్ష్యాలను సాధిస్తే…నేడు అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయి…నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష 68 వేల దరఖాస్తులు వస్తే నేడు 51 వేల సీట్లకు గాను 80 వేల దరఖాస్తులే వచ్చాయన్నారు. ఏడాది పాలనలో 50 కి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదని తెలిపారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భంధం ప్రయోగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్కారు నిర్లక్ష్యం
తెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు శాపమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news