కేటీఆర్.. “నాకు, నీకు పోలికే లేదు అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 70 సార్లు మిస్ వరల్డ్ పోటీలు ఇతర దేశాల్లో జరిగాయి. మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ ఎందుకు అని కేటీఆర్ అడుగుతున్నారు. ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టావు.. కేటీఆర్ నీకు నాకు పోలిక ఏంటి..? అన్నారు.
ఎంత పెద్దోడు అయినా బిల్డ్ నౌ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సందే. కొందరూ మార్కెటింగ్ చేస్తున్నారు. మా లాంటి వాళ్లు కష్టపడుతున్నారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపం ఉందా..? సోషల్ మీడియా పెట్టుబడిదారులది అన్నారు. 18 గంటలు పని చేసే నాకు పట్టులేదట. మేము ధర్నా చేయనియకపోతే పట్టు ఉన్నట్టా..? అని ప్రశ్నించారు. మనుషుల్లో ఉన్న క్రూర మృగాలను నల్లమల్లలో పెరిగిన నాకు గుర్తుపట్టరాదా..? అన్నారు.