జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది రేవంత్ రెడ్డినే – కేటీఆర్

-

జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది సీఎం రేవంత్ రెడ్డినేనని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో..అతన్ని పరామర్శించారు కేటీఆర్‌. జర్నలిస్ట్ శంకర్ ను తుర్కయంజాల్ లోని ఆయన ఇంటిలో పరామర్శించారు కేటీఆర్, BRSparty పార్టీ సీనియర్ నాయకులు.

Ktr Went To journalist shankar house

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ….కొడంగల్ లో జరుగుతున్న రైతుల భూకబ్జాల పైన నిజాలు వెల్లడించినందుకే శంకర్ పైన దాడి అన్నారు. భవిష్యత్తులో శంకర్ కి హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సి వస్తుందని వెల్లడించారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.
శంకర్ పై జరిగిన దాడి విషయంలో పోలీస్ అలసత్వాన్ని, ప్రభుత్వ పక్షపాత వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా ఎండగడతామని హెచ్చరించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news