ఫోన్ ట్యాపింగ్ వల్లే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి – TPCC

-

ఫోన్ ట్యాపింగ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ లో సీఎం రేవంత్ సహా 650 మందికిపైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మా ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆనాడే ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని ఫైర్ అయ్యారు.

mahesh goud
కేసీఆర్ సిగ్గుతో తలవంచుకునే ఘటన ఇది… 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణం అని ఆగ్రహించారు. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్షార్హులు అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్‌కు శిక్ష పడాల్సిందే. ఆనాడు కల్వకుంట్ల కుటుంబం మొత్తం కలిసే రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news