హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమిగలం దొరికింది. రూ.1,20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి జీహెచ్ఎంసీ ఏఈఈ చిక్కింది. హైదరాబాద్–కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనికి సంబంధించిన కొలతలను ఎం-బుక్ లో చేర్చేందుకు రూ.1,20,000 లంచం డిమాండ్ చేసింది ఏఈఈ బి.స్వరూప.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేసి, ఏఈఈ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.