యాదగిరిగుట్ట, కాలేశ్వరం కట్టింది ఆంధ్ర వ్యక్తులే – మహేష్ గౌడ్

-

Mahesh Goud slams ktr: యాదగిరిగుట్ట, కాలేశ్వరం కట్టింది ఆంధ్ర వ్యక్తులే అంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫైర్‌ అయ్యారు. Brs ఇవాళ ఆంధ్ర ప్రస్తావన చేస్తోందని…సమంత ఎవరు.. అంబాసిడర్ ఎలా అయ్యిందని నిలదీశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. నువ్వు కట్టిన ప్రాజెక్టు కట్టింది ఎవరు ? యాదగిరిగుట్ట నిర్మాణం డిజైనర్ ఎవరు..ఆంధ్ర వ్యక్తి కాదా..? అంటూ నిలదీశారు.

Mahesh Goud slams ktr

ఇన్ని మీరు చేసి… మేము తెలంగాణ రాష్ట్ర గీతం కీరవాణి పాడితే తప్పా అని ప్రశ్నించారు. కీరవాణికి అవార్డులు వచ్చినప్పుడు కేటీఆర్.. కేసీఆర్ అభినందించలేదా..? అని ప్రశ్నించారు. లోగో లో అమరుల స్థూపం పెడితే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎందుకు నొప్పి? అమరవీరుల స్థూపంను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పాలి ? అని ఫైర్‌ అయ్యారు. లోగో అంశంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి… అమరుల ఆశయాల సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.. ప్రజలు మిమ్మల్ని నమ్మరన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version