తెలంగాణలో వేలాది మంది అమరులైంది ఎవరి వల్ల? : కేటీఆర్

-

తెలంగాణలో వేలాది మంది పౌరులు అమరులైంది ఎవరి వల్ల అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. అమరవీరుల స్థూపం నిర్వహించాల్సి వచ్చింది ఎవరి వల్ల అని ఎక్స్ వేదికాగ నిలదీశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు? 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు? అని ప్రశ్నించారు.

“1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు ? దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ?” ఇవన్నిటికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని కేటీఆర్ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version