అచ్చంపేటలో విషాదం.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య.. ఆమె బంధువుల దాడిలో భర్త మృతి

-

ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. రోజూ గొడవలు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణానికి భర్తే కారణమంటూ మృతురాలి తరఫు బంధువులు దాడికి దిగడంతో ఆ దాడిలో భర్త మృతి చెందాడు. ఈ విషాద ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన నాగార్జున(28) అచ్చంపేటలో దగ్గరి బంధువుకు చెందిన ఆసుపత్రి నిర్వహణ చూసుకునేవాడు. రెండేళ్ల క్రితం స్థానికురాలైన సింధు(21)ను ప్రేమించాడు. అనంతరం పెళ్లి చేసుకొని పట్టణంలోనే కాపురం పెట్టాడు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన సింధు శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన భర్త ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది.

అదేరోజు రాత్రి మృతదేహంతో తిరిగి అచ్చంపేటకు వస్తుండగా రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్లు సమీపంలో సింధు బంధువులు అంబులెన్సును అడ్డుకుని నాగార్జునను తమ కారులో ఎక్కించుకుని ఎటో తీసుకెళ్లారు. అతడి ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో కుటుంబసభ్యులు శనివారం రోజున పోలీసులను ఆశ్రయించగా గాలింపు మొదలుపెట్టిన పోలీసులకు అచ్చంపేటలో ఎన్టీఆర్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఓ కారులో నాగార్జున మృతదేహం కనిపించింది. అతడి ఒంటిపై గాయాలను గమనించిన కుటుంబసభ్యులు సింధు బంధువులే చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news