ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకొట్లేదని భాగ్యలక్ష్మి గుళ్లో ప్రమాణం చేయాలి -కొత్త మనోహర్ రెడ్డి

-

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకొట్లేదని నిరూపించుకోవాలంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలంటూ సస్పెండెడ్ కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇటీవలే కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే.

manohar-reddy chalenges revanth reddy
manohar-reddy chalenges revanth reddy

ఈ సందర్భంగా సస్పెండెడ్ కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… మహేశ్వరం ఎమ్మెల్యే సీట్ కోసం 10 కోట్లు, 5 ఎకరాలు తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోట్ల రూపాయలు ఇచ్చిన చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి ఇద్దరినీ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు.

గతంలో 25 కోట్లు తీసుకున్నాడని ఈటెల రాజేందర్ ఆరోపిస్తే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రమాణం చేయట్లేదని ఫైర్‌ అయ్యారు. రేవంత్ ప్రమాణం చేయకపోతే సీట్లు అమ్ముకున్నట్లే ప్రజలు నమ్ముతారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకొలేదు అని నిరూపించుకోవాలంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు సస్పెండెడ్ కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news