తెలంగాణ టీడీపీ అధ్యక్ష బరిలో ఐదుగురు కీలక నేతలు..!

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో టీడీపీకి ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2014లో కూడా టీడీపీ కొన్ని ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా టీడీపీ కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే.. టీడీపీ కనుమరుగు అయింది. కాంగ్రెస్ కూడా కనుమరుగు అయిందనుకునే లోపు కాంగ్రెస్ పార్టీ 2024లో విజయం సాధించింది.

ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఫస్ట్ తెలంగాణ అధ్యక్షుడిని ఎన్నుకుంటే.. తెలంగాణ టీడీపీని డెవలప్ చేయాలని భావిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మరికాసేపట్లోనే చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు ఆయన చేరుకోనున్నారు. పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. టీ టీడీపీ అధ్యక్షుడి బరిలో సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నరసింహులు, నందమూరి సుహాసిని, సామ భూపాల్ రెడ్డి, కాట్రగ్డ ప్రసూన పోటీ పడుతున్నారు. వీరిలో మరీ అధ్యక్ష పదవీ ఎవ్వరికీ దక్కుతుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version