హైదరాబాద్ ప్రజలు బయటకు రావొద్దు – GHMC

-

హైదరాబాద్ ప్రజలు బయటకు రావొద్దని హైదరాబాద్‌ GHMC హెచ్చరించింది. వచ్చే గంటలో హైదరాబాద్ నగరవంతంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ తరుణంలోనే హైదరాబాద్ నగర ప్రజల్ని అప్రమత్తం చేసిన జిహెచ్ఎంసి.. అవసరమైతే తప్ప బయటికి రావద్దు అని సూచించింది.

కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై నుంచి వర్షపు నీరు డ్రైనేజీతో పాటు ప్రవహిస్తుంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వారాసిగూడా, మహమ్మద్ గూడ, చిలకలగూడా ప్రధాన నాల పొంగిపొర్లుతుంది, ఒలిఫెంటా బ్రడ్జ్ ప్రధాన రహదారి జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జగత్ గిరి గుట్ట,ముసాపెట్ , కూకట్ పల్లి, జే ఎన్ టీ యు,హైదర్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగీ, మణికొండ, గండిపేట, బండ్లగూడ లో వాన దంచి కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news