మేడిపల్లి సత్యం సతీమణి సూసైడ్‌ లో ట్విస్ట్‌..ఆ టార్చరేనట !

-

 

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సతీవియోగం కలిగింది. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రూపా దేవి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. గత 12 సంవత్సరాల క్రితం రూపదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొంపల్లిబ్లోని గత సంవత్సర కాలంగా పేట్ బషీరాబాద్ లోని దవేరియా విల్లాస్ లోని నివాసం ఉండేది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. అటు భార్య మృతిని తట్టుకోలేక హాస్పటల్లో స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే సత్యం. అటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపా దేవిని మృతిని తెలుసుకొని కొంపెల్లి లోని రెన్నోవ ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యేని మేడిపల్లి సత్యాన్ని పరామర్శించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news