ఈ వారంలోనే మెగా డీఎస్సీ.. 11,060 పోస్టుల భర్తీకి సన్నాహాలు

-

త్వరలోనే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మరో వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేయనుంది. ఈ వారంలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. దాదాపు 11,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డీఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీఎస్సీకి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా, తక్కువ పోస్టులకే ఉద్యోగ ప్రకటన జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం భారీగా భర్తీ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది.

 మరోవైపు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై  కీలక ప్రకటన చేసింది. జూన్ 9వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే టీఎస్‌పీఎస్సీ 563 పోస్టులతో గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version