గనుల శాఖపై నేడు మంత్రి మహేందర్ రెడ్డి తొలి సమీక్ష

-

గనుల శాఖ పై నేడు తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి తొలి రివ్యూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే.. సచివాలయంలో మైనింగ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు మంత్రి మహేందర్ రెడ్డి. గనుల లీజు విధానాన్ని పక్కన పెట్టి టెండర్ ప్రాతిపదికన గనులు కేటాయించే విధానం పై చర్చించనున్నారు.

Minister Mahender Reddy’s first review of the Department of Mines today

ఇప్పటికే 40 గనులకు టెండర్లు ఆహ్వానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది మైనింగ్ శాఖ. ఈ తరుణంలోనే.. గనుల శాఖ పై నేడు తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి తొలి రివ్యూ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాగా, ఆగస్టు 24 వ తేదీన తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై పట్నం మహేంధర్ రెడ్డితో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ కి సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు హాజరయ్యారు. మంత్రి మహేంధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జాతీయ గీతాన్ని ఆలపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version