999కి చేరిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల సంఖ్య

-

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తులు నిన్నటితో 999కి చేరాయి. దరఖాస్తులకు ఎటువంటి రుసుము లేనందున ఒక్కొక అభ్యర్థి 3, 4 అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తులకు 10వ తేదీ వరకు గడువు ఉండడం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే… ఎన్నికల కమిటీ ల పై బీజేపీ కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగానే.. ఇవాళ కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, ఇంద్ర సేనా రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో, ఛార్జ్ షీట్ , సభలు, తదితర కమిటీలు వేయనుంది బీజేపీ పార్టీ. అలాగే..ఇవాళ సాయంత్రం జరగనున్న మీటింగ్ ఎజెండా పై కూడా చర్చించనున్నారు నేతలుకిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, ఇంద్ర సేనా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version