తెలంగాణలోని రైతులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరో వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్ డబ్బులను రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని అన్నారు.

స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని కావున శ్రేణులు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మరోవైపు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.