వివాదంలో మంత్రి తలసాని.. వెనక్కి లాగి, చెంప దెబ్బ కొట్టి !

-

వివాదంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చిక్కుకున్నారు. తనకు అడ్డొచ్చిన వ్యక్తిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేయి చేసుకున్న వీడియో వైరల్ అవుతుంది. నిన్న హైదరాబాద్ నగరంలో స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి మంత్రులు కేటీఆర్, తలసాని వచ్చారు.

అయితే బ్రిడ్జి చూసేందుకు ఓ వ్యక్తి తలసాని కంటే ముందు వెళ్లారు. దీంతో అతన్ని వెనక్కి లాగి, చెంప దెబ్బ కొట్టారు తలసాని. దీంతో మంత్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news