ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం

-

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. పంచాయతీ, వార్డు స్థానాల ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. 34 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా…. YCP 22, YCP రెబల్-1, TDP 9, టిడిపి+జనసేన మద్దతుదారులు 2 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు.

అటు 245 వార్డు స్థానాలకుగాను YCP మద్దతు దారులు 141, YCP రెబల్ 2, TDP+జనసేన ఒకటి, CPM-1, ఇతరులు మూడు చోట్ల గెలుపొందారు. నామినేషన్లు రాకపోవడంతో రెండు చోట్ల ఎన్నిక నిర్వహించలేదు. ఇక అటు పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై పార్టీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులు, నాయకులకు చంద్రబాబు అభినందనలు చెప్పారు. గతంలో వైసీపీ చేతిలో ఉన్న ఈ స్థానాలను.. ఉప ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకోవడం శుభ పరిణామమని.. వైసీపీ ప్రభుత్వం రోజు రోజుకూ ప్రజల మద్దతు కోల్పోతోందని వెల్లడించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news