వివాదంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..మహిళా అధికారిపై ?

-

 

MLA Komatireddy Rajagopal Reddy Fire On Officials: మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం చౌటుప్పల్ పట్టణానికి వచ్చారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించే డ్రైనేజీ, సిసి రోడ్డు పనులు, బిల్లుల రికార్డుల గురించి ఆరా తీశారు.

MLA Komatireddy Rajagopal Reddy Fire On Officials

ఈ సందర్భంగా ఆయన అధికారులపై దురుసుగా ప్రవర్తించారు మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటివరకు రూ. 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూలో గ్రాస్ ఎంత బుక్ అయ్యింది, దానిపై క్లారిటీ ఇవ్వాలని మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ అధికారులపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతుండగా ఓ మహిళ ఉద్యోగి పేపర్ పై ఏదో రాస్తుండటంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ఆమెపై పేపర్లు విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news