రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేసిన టీడీపీ ఎంపీ !

-

రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయించారు టీడీపీ ఎంపీ. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విగ్రహం రూపుదిద్దుకుంటుంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (గతంలో ఈనాడు రిపోర్టర్) కోరికతో విగ్రహం తయారు చేస్తున్నట్లు కోనసీమ జిల్లా కొత్తపేటలోని ప్రముఖ శిల్పి రాజకుమార్ ఉడయార్ తెలిపారు.

Ramoji Rao statue installed by TDP MP

రామోజీరావు గురించి భావితరాలకు తెలియజేయాలని ఉద్దేశంతో “ఈనాడు” ప్రారంభమైన విశాఖపట్నంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని అప్పలనాయుడు చెప్పారు. కాగా జూన్‌ 9న రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీరావుకు అశ్రునయనాల మధ్య ఆయన కుటుంబం, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ దహనసంస్కారాలు జరిపారు. అశ్రునయనాలతో కుటుంబసభ్యులు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలికారు.

 

Read more RELATED
Recommended to you

Latest news