ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్రమంత్రులు

-

లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని రాష్ట్ర మాజీ గవర్నర్‌, చెన్నై (సౌత్‌) లోక్‌సభ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులు అవుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి ఆమె హైదరాబాద్‌ విచ్చేసిన విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారం ద్వారా రాష్ట్ర ప్రజలను మరోసారి కలిసే అవకాశం వచ్చిందని తమిళిసై అన్నారు. వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లను తీసేసే ప్రసక్తే ఉండదన్న స్పష్టతను ఇప్పటికే బీజేపీ నాయకత్వం ఇచ్చిందని వెల్లడించారు. దేశంలో కాంగ్రెస్‌ విధించిన ఎమర్జెన్సీలో తాను కూడా బాధితురాలినే అంటూ.. అప్పట్లో తన తండ్రిని అరెస్టు చేస్తే తమ కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని చెప్పారు. మరోవైపు కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ ఇన్‌ఛార్జిగా తమిళిసైని పార్టీ నియమించింది.

Read more RELATED
Recommended to you

Latest news