మందమర్రిలో విషాదం.. ఇంట్లో ఉరేసుకుని తల్లీకుమార్తె ఆత్మహత్య

-

మంచిర్యాల జిల్లా మందమర్రిలో తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్ – ధనలక్ష్మి దంపతులు… స్థానికంగా పాపడాలు, చెకోడీలు తయారుచేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లడంతో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ధనలక్ష్మి, ఆమె కుమార్తె జీవని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

మృతురాలి కుమారుడు సిద్దు ఇంట్లోనే ఉన్నప్పటికీ అతను గమనించలేదు. ఉదయం లేచి చూసేసరికి అక్క, తల్లి శవాలుగా కనిపించడంతో బాలుడు సొమ్మసిల్లి  పడిపోయాడు. సమాచారం అందుకుని ఇంటికి వచ్చిన బంధువులు విగతజీవులుగా మారిన తల్లీబిడ్డల్ని చూసి బోరున విలపించారు. మరోవైపు ఎప్పుడైనా వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మృతురాలి భర్త మురుగన్ రాత్రి నుంచి ఇంటికి రాకపోవడమే కాకుండా అతని ఫోన్‌ కూడా స్విచ్‌ఆఫ్ రావడం పలు అనుమానాలను రేకిత్తిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి , ఎస్ఐ చంద్రకుమార్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version