తెలుగు స్క్రైబ్ పై కాంగ్రెస్ ఎంపీ అనిల్ కేసు పెట్టారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు స్క్రైబ్ ఎక్స్ ఖాతాపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్.

ఇక కాంగ్రెస్ ఎంపీ అనిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు. అటు Telugu Scribe సోషల్ మీడియాను బీఆర్ఎస్ పార్టీ వాళ్లే నడిపిస్తారని గౌతమ్ గౌడ్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Telugu Scribeతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసాడట, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కంటెస్టెంట్కు కాంగ్రెస్ నేతలు ఇబ్బంది కలిగించారనే వార్త తను పోస్టు చేయలేదని వెల్లడించాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో విచారణకు హాజరై వివరాలను వెల్లడించిన గౌతమ్ గౌడ్.. ఆ తర్వాత తనతో బలవంతంగా మాట్లాడించినట్లు పేర్కొన్నారు.