రేవంత్ రెడ్డిని లేపమని మీడియాకు కేసీఆర్ పైసలు పంపిస్తున్నాడు – అరవింద్ ధర్మపురి

-

సీఎం కేసీఆర్ పై బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని లేపమని మీడియా సంస్థలకు కేసీఆర్ పైసలు పంపిస్తున్నాడని ఫైర్‌ అయ్యాడు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. కాంగ్రెస్ పార్టీని లేపాలని కేసీఆర్ అనుకున్నాడని… కేసీఆర్ అనుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హైప్ వచ్చిందని తెలిపాడు.

వెంటనే దించాలి అనుకుని రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి 3 గంటల కరెంట్ చాలు, ఉచిత విద్యుత్ అవసరం లేదని చెప్పమని చెప్పాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ అరవింద్ ధర్మపురి. సీఎం కేసీఆర్ చెప్పినట్లు రేవంత్ రెడ్డి ఆడుతున్నాడన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. కాగా, ఉచిత కరెంట్‌ పై ఇటీవల రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. తెలంగాణ లో నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news