రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

-

హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్‌లో కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని రాహుల్‌ గాంధీకి ఒవైసీ సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.  

 

1992వ సంవత్సరంలో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీని వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయమని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదును కూల్చివేశారని అసదుద్దీన్ పునరుద్ఘాటించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ వ్యాఖ్యానించిన కొద్ది గంటల తర్వాతే ఒవైసీ ఈ సవాల్ విసిరారు. మరోవైపు బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి దూషించిన ఘటన పై స్పందిస్తూ.. పార్లమెంట్లో ముస్లింపై మూక హత్యలు జరిగే రోజు ఎంతో దూరం లేదన్నారు

Read more RELATED
Recommended to you

Latest news